లాక్డౌన్ నేపథ్యంలో ఇంటిపట్టునే ఉన్న సెలబ్రిటీలు తమ కళలకు పదును పెడుతూ దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. బాలీవుడ్ భామ సన్నీలియోన్ తన ముగ్గురు పిల్లలను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వారిని ఏదో పిక్నిక్కు తీసుకెళుతున్నట్లు రెడీ చేయించి బయటకు తీసుకొచ్చింది. అనంతరం జస్టిన్ టింబర్లేక్ ఆలపించిన పాటకు సన్నీ, ఆమె భర్త డేనియల్ వెబర్తో కలిసి స్టెప్పులేసింది. పిల్లల చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ వారిని సంతోషపెట్టింది. ఇది అటు పిల్లలతో పాటు అభిమానులను అలరిస్తోంది. ఈ డ్యాన్స్ వీడియోను సన్నీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇందులో నోహా, అశేర్, నిషా ముగ్గురూ డ్యాన్స్కు ఊగిపోతూ చప్పట్లతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇంట్లోనే పిక్నిక్ ప్లాన్ చేసిన సన్నీలియోన్